Sai Teja: లాన్స్ నాయక్ సాయితేజ సహా ఆరుగురి మృతదేహాల గుర్తింపు

  • హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మృతి
  • స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • మిగిలిన వారి మృతదేహాల గుర్తింపు పనిలో అధికారులు
Lance Nayak Sai Teja body identified

హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిలో చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం కూడా ఉన్నట్టు సైన్యం తెలిపింది.

అలాగే, గుర్తించిన వాటిలో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలు కూడా వున్నాయి. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సైన్యాధికారులు తెలిపారు. కాగా, గుర్తించిన వారి మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News