ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారు: మాజీ సెలెక్టర్ సబా కరీమ్
- 2017లో కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించాడు
- కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడింది
- ఈ నాలుగు టోర్నీల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదు
గత నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయిందని... ఈ కారణం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించారని సబా కరీమ్ అన్నారు. 2017లో మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారని చెప్పారు. కోహ్లీ కెప్టెన్ గా భారత్ నాలుగు ఐసీసీ టోర్నీలను ఆడిందని... వీటిలో రెండు టోర్నీల్లో ఫైనల్స్ లో ఓడిపోయామని, ఒక్క టోర్నీలో సెమీస్ లో వెనుదిరిగామని తెలిపారు. ఒక్క టోర్నీని కూడా గెలవకపోవడం వల్లే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించారని అన్నారు.