Army Helicopter: కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్లో ఉన్న వారి వివరాలు!

  • కుప్పకూలిన హెలికాప్టర్ లో 14 మంది
  • బ్రిగేడియర్, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారులు
  • రావత్ భార్య మృతి చెందినట్టు సమాచారం
List of passengers of Crashed army IAF helicopter

తమిళనాడులోని కోయంబత్తూరు-సూళూరు మధ్యలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్ ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, గుర్ సేవక్ సింగ్, జితేందర్ సింగ్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి సాయితేజ, హవాల్దార్ సత్పాల్ ఉన్నారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రావత్ భార్య మధులిక మృతి చెందినట్టు తెలుస్తోంది.

More Telugu News