YSRCP: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన 11 మంది వైసీపీ సభ్యులు!

  • స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు
  • ప్రమాణస్వీకారం చేయించిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
  • గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
11 YSRCP MLCs takes oath

11 మంది వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో వీరంతా ఎన్నికయ్యారు. వీరిచేత శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు వీరే:

  • అనంతపురం జిల్లా - వై. శివరామిరెడ్డి
  • చిత్తూరు జిల్లా - భరత్
  • ప్రకాశం జిల్లా - తుమాటి మాధవరావు
  • గుంటూరు జిల్లా - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు
  • కృష్ణా జిల్లా - మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్
  • తూర్పుగోదావరి జిల్లా - అనంత సత్య ఉదయ్ భాస్కర్
  • విశాఖపట్నం జిల్లా - వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు
  • విజయనగరం జిల్లా - ఇందుకూరి రఘురాజు

More Telugu News