ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాయాలి: బాల్క సుమన్
- పేద ప్రజల భూములను కబ్జా చేశారు
- కబ్జా చేసినట్టు జిల్లా కలెక్టర్ నివేదిక ఇచ్చారు
- ఈటలపై చట్ట పరంగా ఏమేం జరగాలో అన్నీ జరుగుతాయి
మెదక్ జిల్లా కలెక్టర్ పై ఈటల కుటుంబీకులు చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆక్రమించుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులకు ఈటల ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఈటలపై చట్టపరంగా ఏమేం జరగాలో అన్నీ జరుగుతాయని తెలిపారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల్క సుమన్ పైవ్యాఖ్యలు చేశారు.