పంజాబ్ లో కంగన కారును చుట్టుముట్టిన రైతులు
- కర్తార్ పూర్ సాహిబ్ వద్ద కంగనాను అడ్డుకున్న రైతులు
- క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
- ట్విట్టర్ లో వెల్లడించిన కంగన
- తనను చంపుతామని బెదిరించారని ఆరోపణ
తనను ఓ గుంపు చుట్టుముట్టిందని తెలిపింది. వారు తనను దూషించారని, చంపుతామని బెదిరించారని వివరించింది. ఆ సమయంలో తనతో పాటు భద్రతా సిబ్బంది లేకపోతే ఏంజరిగేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. "నేనేమైనా రాజకీయనేతనా? ఇలాంటి ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. నమ్మలేకపోతున్నాను. ఇదేం ప్రవర్తన?" అంటూ మండిపడింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి మద్దతుదారుగా గళం వినిపిస్తున్న కంగన... వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడడం రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.