కోహ్లీ అవుట్ పై వివాదం.... టీవీ అంపైర్ పై తీవ్ర విమర్శలు
- ముంబయిలో రెండో టెస్టు
- టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- కోహ్లీ ఎల్బీడబ్ల్యూ
- బంతి బ్యాట్ కు తగిలినట్టు రీప్లేలో వెల్లడి
దీనిపై సీబీఐ విచారణ అవసరం అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. థర్డ్ అంపైర్ ను కటకటాల వెనక్కి నెట్టాలంటూ డిమాండ్ చేశాడు. మరో నెటిజన్ థర్డ్ అంపైర్ ను కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారితో పోల్చాడు. పార్థివ్ పటేల్ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఇది అంపైర్ తప్పిదమేనని తేల్చి చెప్పాడు. మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ, కనీస జ్ఞానం కొరవడిందని విమర్శించాడు.