CM KCR: గద్వాల ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

  • గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పితృవియోగం
  • విషాదంలో ఎమ్మెల్యే కుటుంబం
  • నేడు గద్వాల వచ్చిన సీఎం కేసీఆర్
  • ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి నివాళి
CM KCR consoles Gadwal MLA family members

ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి మృతి చెందారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గద్వాల వచ్చారు. బండ్ల వెంకట్రామిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

విషాదంలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.

More Telugu News