సిరివెన్నెల మృతి పట్ల సీఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి!
- సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అన్న జగన్
- సాహితీ లోకానికే తీరని లోటు అన్న చంద్రబాబు
- ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. దాదాపు 3 వేలకు పైగా పాటలు రాసి, సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు అని అన్నారు. సీతారామశాస్త్రి ఆత్మశాంతికై భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.