వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పండుగలన్నీ ఆదివారమే!
- 23 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
- ఐచ్ఛిక సెలవుల్లో 9 ఆదివారమే
- సెలవుల్లో మార్పులు ఉంటే పత్రికా ప్రకటన ద్వారా ముందే తెలియజేస్తామన్న ప్రభుత్వం
కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, మిలాద్-ఉన్-నబీ, క్రిస్మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్దశి, యాజ్–దహుం–షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు కూడా ఆదివారమే రావడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
తిథుల ప్రకారం నిర్వహించే హిందూ పండుగలతోపాటు అప్పటికప్పుడు నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహరం, మిలాద్-ఉన్-నబీ వంటి పండుగల్లో మార్పులు అవసరమైతే కనుక పత్రికా ప్రకటన ద్వారా ముందుగానే తెలియజేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.