బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీ.. ప్రకటించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య
- అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆనందయ్య
- పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శ
- బీసీ జేఏసీని కలుపుకుని కొత్త పార్టీ పెడతామని వెల్లడి
- ప్రభుత్వం అనుమతిస్తే మూడో దశకు మందు పంపిణీ
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.