రోగికి చికిత్స చేస్తుండ‌గా వైద్యుడికి గుండెపోటు.. ఇద్ద‌రూ మృతి

patient and doctor die of heart attack
  • కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌
  • గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండెనొప్పి
  • ఆసుప‌త్రికి వెళ్లిన బాధితుడు
  • అత‌డికి వైద్యం చేస్తుండ‌గా ఘ‌ట‌న‌
గుండెపోటుకు గురైన ఓ వ్య‌క్తి ఆసుప‌త్రికి వెళ్లాడు. అయితే, అత‌డికి చికిత్స చేస్తోన్న స‌మ‌యంలో వైద్యుడికీ గుండెపోటు రావ‌డంతో రోగితో పాటు ఆయ‌న కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్‌ తండాలో చోటు చేసుకుంది.

గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తి గుండెనొప్పితో ఆసుప‌త్రికి వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అతడికి చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యుడి పేరు లక్ష్మణ్ అని పోలీసులు తెలిపారు. గుండెపోటుకు గురైన వైద్యుడు లక్ష్మణ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, పేషెంట్‌ను కామారెడ్డి ఆసుప‌త్రికి తీసుకెళ్తోన్న స‌మ‌యంలో మృతి చెందాడు.
Go Back to Shorts
Kamareddy District
doctor

More Telugu News