అందుకే కేసీఆర్లో అసహనం పెరిగింది: ఈటల వ్యాఖ్యలు
- హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయారు
- ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు
- టీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానేయాలి
అంతేగాక, రైతులు పండించిన ధాన్యంపై పెట్టుబడి అంతా కేంద్ర ప్రభుత్వమే పెడుతోందని ఆయన అన్నారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానేసి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి, మరి ధాన్యాన్ని కేసీఆర్ ఎందుకు కొనుగోలు చేయట్లేదని ఆయన నిలదీశారు.