పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం
- ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- డిసెంబరు 23 వరకు సమావేశాలు
- టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
- పలు అంశాలపై చర్చ
పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపు వ్యవహారం, ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈఏపీ నిధుల దారి మళ్లింపు, రాష్ట్రంలో చమురు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో వరి వేయొద్దని మంత్రులు ప్రకటించిన వైనం, వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని చంద్రబాబు నిర్దేశించారు.