తమిళనాడులో వర్ష బీభత్సం... 8 మంది మృతి
- ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు
- తమిళనాడులో అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్
- ఇవాళ ఒక్కరోజే ఐదుగురి మృతి
- ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం
నిన్న ముగ్గురు మరణించగా, నేడు మరో ఐదుగురు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తమిళనాడులోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
కాగా, దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం (నవంబరు 29) నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని, పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావం ఏపీపై ఏమాత్రం ఉంటుందన్నది ఇంకా తెలియరాలేదు.