పెన్సిల్ పోయిందంటూ కర్నూలు జిల్లా కడుబూరు పోలీసులకు చిన్నారి ఫిర్యాదు... వీడియో ఇదిగో!

Kid complains police about pencil theft
  • పోలీస్ స్టేషన్ లో పెన్సిల్ పంచాయితీ
  • మరో పిల్లవాడిపై ఓ చిన్నారి ఫిర్యాదు
  • రాజీ కుదిర్చిన పోలీసులు
  • వీడియోను పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
కర్నూలు జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పెద కడుబూరు పోలీసులను ఆశ్రయించాడు. మరో పిల్లవాడు తన పుస్తకాలు, పెన్సిల్ ఎత్తుకెళ్లాడని, రోజూ ఇలాగే చేస్తుంటాడని ఆ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడ్ని కూడా స్టేషన్ కు పిలిపించారు. మరెప్పుడూ ఇలా చేయకూడదంటూ ఆ అబ్బాయికి హితవు పలికారు. అంతేకాదు, ఆ ఇద్దరు చిన్నారుల మధ్య రాజీ కుదిర్చి, చేయి చేయి కలిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Go Back to Shorts
Pencil
Theft
Police
Kurnool District
Vishnu Vardhan Reddy

More Telugu News