Chandrababu: జగన్ ఒక వృద్ధుడు... అందుకే ప్రజల్లో తిరగలేడు: చంద్రబాబు

  • చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • వరద బాధితులకు పరామర్శ
  • జగన్ పై విమర్శలు
  • ప్రజల్లోకి రాలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని వ్యాఖ్యలు
Chandrababu visits Chittoor district flood hit areas

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద బాధితులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుచానూరులో పర్యటించిన సందర్భంగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక వృద్ధుడని, ప్రజల్లో తిరగలేక వీడియో కాన్ఫరెన్స్ లు పెడుతుంటాడని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు.

తాగునీటి సంఘాలు పనిచేసి ఉంటే ఇవాళ చెరువులు తెగేవా? అని ప్రశ్నించారు. తుమ్మలగుంట భూముల కబ్జాతో తిరుపతిని వరద నీటితో ముంచారని ఆరోపించారు. తాము చెరువులను ఆధునికీకరించామని, వైసీపీ నేతల్లా ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు.

More Telugu News