గాయపడిన సీపీఐ నారాయణకు స్వయంగా వైద్యం చేసిన వైసీపీ ఎంపీ
- చిత్తూరు జిల్లాలో వరదలు
- రాయల చెరువు లీకేజి అంటూ వార్తలు
- పరిశీలనకు వెళ్లి గాయపడిన నారాయణ
- కొండ దిగుతుండగా బెణికిన కాలు
- ప్రథమచికిత్స చేసిన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి
ఇంతలో తిరుపతి ఎంపీ, వైసీపీ నేత డాక్టర్ గురుమూర్తి అక్కడికి వచ్చి గాయంతో బాధపడుతున్న సీపీఐ అగ్రనేత నారాయణను గమనించారు. వెంటనే స్పందించిన ఆయన నారాయణ కాలికి చికిత్స చేశారు. కాలుకు కట్టుకట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వృత్తి పట్ల అంకితభావం, మంచి మనసు చూపారంటూ వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.