వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు
- కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
- వరద బాధితులకు పరామర్శ
- సీఎం జగన్ పై విమర్శలు
- ఆకాశంలో విహరిస్తే కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం
ఈ క్రమంలో ఆయన ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.