క్షమాపణలు తెలిపిన 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్
- సూర్య హీరోగా జై భీమ్ చిత్రం
- వన్నియార్ కులాన్ని కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు
- చిత్రంపై పట్టాళి మక్కళ్ కట్చి తీవ్ర ఆగ్రహం
- వివరణ ఇచ్చిన జ్ఞానవేల్
ఈ వివాదానికి హీరో సూర్య బాధ్యత వహించాలనడం సబబు కాదని జ్ఞానవేల్ స్పష్టం చేశారు. సూర్య ఓ నిర్మాతగా, నటుడిగా జై భీమ్ చిత్రం ద్వారా ఓ గిరిజన తెగ ఎదుర్కొన్న సమస్యలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని, ఇప్పుడు అకారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నారని జ్ఞానవేల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదం వచ్చినందుకు సూర్యను కూడా క్షమించమని కోరతానని వెల్లడించారు.