Amaravati: కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన రాజధాని రైతుల మహాపాదయాత్ర

  • మొత్తం 45 రోజులపాటు సాగనున్న పాదయాత్ర
  • నేడు 16 కిలోమీటర్ల పాటు సాగి ప్రకాశం జిల్లా గుడ్లూరుకు చేరుకోనున్న యాత్ర
  • మధ్యాహ్నం మోపాడులో భోజనం
AP Capital Farmers maha padayatra reached to 17th day

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నేడు 17వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ఈ ఉదయం ప్రారంభమైన యాత్ర 16 కిలోమీటర్ల పాటు సాగనుంది. మధ్యాహ్నం మోపాడులో రైతులు భోజనం చేస్తారు. రాత్రికి ప్రకాశం జిల్లా గుడ్లూరులో రైతులు బస చేస్తారు. మొత్తం 45 రోజులపాటు సాగనున్న ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగుతుంది. డిసెంబరు 15న తిరుపతికి చేరుకోవడంతో పాదయాత్ర ముగుస్తుంది.

More Telugu News