సంక్రాంతి తరువాతనే థియేటర్లకు 'విరాటపర్వం'!

Virataparvam in Theatres
  • ఓటీటీలో వచ్చిన వెంకటేశ్ 'నారప్ప'
  • అమెజాన్ ప్రైమ్ కి 'దృశ్యం 2'
  • 'విరాటపర్వం' రిలీజ్ పై సందేహాలు
  • థియేటర్లకే అన్నది లేటెస్ట్ టాక్  
రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన నక్సలైట్ గా కనిపించనున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సుధాకర్ చెరుకూరి - సురేశ్ బాబు నిర్మించారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగానే ఉంది.

ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. సురేశ్ బాబు నిర్మాతగా ఉన్న 'నారప్ప' ఓటీటీలోనే ప్రేక్షకులను పలకరించింది. ఇక ఆ తరువాత సినిమాగా రూపొందిన 'దృశ్యం 2' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే రానా 'భీమ్లా నాయక్' సినిమాను కూడా దాదాపు పూర్తిచేశాడు.

ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ లోగా 'విరాటపర్వం' ఓటీటీలో వచ్చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ 'భీమ్లా నాయక్' రిలీజ్ తరువాత, 'విరాట పర్వం' సినిమాను థియేటర్లకే తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారని  చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Rana Daggubati
Sai Pallavi
Virataparvam Movie

More Telugu News