Radhe Shyam: "ఈ రాతలే"... ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి తొలి పాట విడుదల

  • ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్'
  • 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
  • జస్టిన్ ప్రభాకరన్ సంగీతం
  • ఈ రాతలే పాటకు సాహిత్యం అందించిన కృష్ణకాంత్
First single released from Radhe Shyam

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. 'రాధేశ్యామ్' చిత్రం నుంచి తొలి పాట లిరికల్ వీడియో రిలీజైంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. "ఈ రాతలే" అంటూ సాగే లవ్లీ సాంగ్ ను నేడు లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. 'రాధేశ్యామ్' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో వస్తోంది.

More Telugu News