YS Vivekananda Reddy: వైయస్ వివేకానందరెడ్డి హత్య వెనకున్నది ఆయన రక్తసంబంధీకులే: పంచుమర్తి అనురాధ

  • వివేకా హత్య కేసులో వాస్తవాలు నిర్ధారణ అయ్యాయి
  • అయినా వైసీపీ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • వైసీపీ నేతల చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
YS Viveka murdered by his blood relatives says Panchumarthi Anuradha

వైయస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఈ స్టేట్మెంట్ లో పెద్ద నేతల పేర్లు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఆయన రక్తసంబంధీకులే ఉన్నారని నిర్ధారణ అయిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారని మండిపడ్డారు.

వివేకా హత్యపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గతంలో విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారని అనురాధ అన్నారు. ఈ హత్య కేసు గురించి వైసీపీ బులుగు మీడియా, ఆ పార్టీ నేతలు మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల చర్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

ఈ కేసుపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

More Telugu News