Robin Uthappa: పాకిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప

  • ఈ సాయంత్రం రెండో సెమీస్ లో తలపడనున్న ఆసీస్, పాక్
  • ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందన్న రాబిన్ ఊతప్ప
  • ఇప్పటి వరకు ఉన్న జోరును కొనసాగిస్తే పాక్ దే విజయమని వ్యాఖ్య
Pakistan will win on Australia says Robin Uthappa

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు రెండో సెమీఫైనల్స్ జరగనుంది. ఈ సాయంత్రం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ పోటీలో గెలుపొందే జట్టు ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కొంటుంది.

ఈ సందర్భంగా టీమిండియా బ్యాట్స్ మెన్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ... ఆస్ట్రేలియాను పాకిస్థాన్ ఓడిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత టోర్నీలో ఈ రెండు జట్లు బాగా ఆడుతున్నాయని, అయితే, ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో పాకిస్థాన్ జయకేతనం ఎగురవేసిందని తెలిపాడు.

ఈ ప్రపంచకప్ లో పాక్ జట్టు మాత్రమే అజేయంగా కొనసాగుతోందని...  అందుకే రెండో సెమీస్ లో ఫేవరెట్ గా పాక్ బరిలోకి దిగుతుందని చెప్పాడు. ఇప్పటి వరకు కొనసాగించిన జోరును కొనసాగిస్తే పాకిస్థాన్ గెలవడం ఖాయమని అన్నాడు. ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోందని... ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని చెప్పాడు.

More Telugu News