Crime News: మంత్రి తలసాని కుమారుడిపై కేసు న‌మోదు చేశాం: పోలీసులు

  • ఇటీవ‌ల ఓ వ్య‌క్తిని ఢీకొన్న త‌ల‌సాని కుమారుడి కారు
  • హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఘ‌ట‌న‌
  • కేసులో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
police files case against sai yadav

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిర‌ణ్‌ యాదవ్ కారు ఇటీవ‌ల ఓ వ్య‌క్తిని ఢీకొట్ట‌డంతో ఆ వ్యక్తి గాయపడ్డ విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఆయ‌న‌ పాల్గొని, తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సాయికిరణ్‌ యాదవ్‌పై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంతోష్‌(32) అనే వ్య‌క్తి ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడి కారు టైరు వెళ్లిందని పోలీసులు వివ‌రించారు. ఈ ఘటనలో సంతోష్‌ గాయపడగా, కిమ్స్ ఆసుప‌త్రికి తరలించి చికిత్స అందించామ‌ని చెప్పారు. సాయికిరణ్ పై న‌మోదైన‌ కేసును దర్యాప్తు చేస్తున్నామని  వివ‌రించారు.

  • Loading...

More Telugu News