అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల బయట రైతుల ఆందోళన
- పంజాబ్లోని హోషియార్పూర్లో ఘటన
- సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు అక్షయ్ మద్దతు ఇవ్వలేదని ఆందోళన
- మద్దతు ఇచ్చేంత వరకు అడ్డుకుంటామన్న రైతులు
సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని థియేటర్ యజమానులను డిమాండ్ చేశాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న తమకు నటుడు అక్షయ్ కుమార్ మాటమాత్రమైనా మద్దతు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు సినిమాను ప్రదర్శించనివ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.