Tollywood: ‘యాక్షన్ బ్లాక్ బస్టర్’ అంటూ ‘శ్రీదేవి సోడా సెంటర్’పై చిత్ర యూనిట్ ఆసక్తికర ప్రకటన

  • ‘జీ5’లో రేపట్నుంచే స్ట్రీమింగ్ అని వెల్లడి
  • సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా సినిమా
  • కరుణ కుమార్ డైరెక్షన్
Sridevi Soda Center To Be Streamed Exclusively On Zee 5 From Tomorrow

‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదలకు ముస్తాబైంది. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ ‘జీ5’లో ఆ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర బృందం, జీ5 ఈ విషయాన్ని ప్రకటించాయి. సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా కరుణకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ‘జీ5’ ఎక్స్ క్లూజివ్ గా సినిమాను విడుదల చేస్తోంది.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపే సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఓ చిన్న వీడియో గ్లింప్స్ నూ విడుదల చేసింది. ‘‘ఉత్కంఠభరితమైన యాక్షన్ ఘట్టాలతో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ రేపట్నుంచి ‘జీ5’లో స్ట్రీమ్ అవుతుంది’’ అని తెలిపింది.

More Telugu News