వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన
- యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు
- ఆర్ఎల్డీతో పొత్తు ఖరారయిందన్న అఖిలేశ్
- తన బాబాయ్ తో ఇబ్బంది లేదని వ్యాఖ్య
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీతో సమాజ్ వాదీ పార్టీకి పొత్తు ఉంటుందని చెప్పారు. పొత్తు ఖరారయిందని, సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. తన బాబాయ్ శివపాల్ యాదవ్ కు చెందిన ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ లోహియా (పీఎస్పీఎల్)తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని... వారితో కలిసి పని చేయడంలో అభ్యంతరం లేదని చెప్పారు. అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం ఆజంఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు.