Tremors: తెలంగాణలో పలు చోట్ల భూప్రకంపనలు

  • తెలంగాణలో తరచుగా ప్రకంపనలు
  • ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కంపించిన భూమి
  • నేడు జగిత్యాల, రామగుండం ప్రాంతాల్లో ప్రకంపనలు
  • ప్రజల్లో ఆందోళన
Tremors in some parts of Telangana

తెలంగాణలో ఇటీవల మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో  భూప్రకంపనలు రావడం తెలిసిందే. నేడు మరోసారి భూమి కంపించింది. ఈసారి జగిత్యాల, రామగుండం ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. సాయంత్రం 6.49 గంటలకు భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూప్రకంపనలతో జగిత్యాల, రామగుండం ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

More Telugu News