Andhra Pradesh: ఏపీలో కొత్తగా 481 మందికి కరోనా నిర్ధారణ

  • గత 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 157 కొత్త కేసులు
  • అనంతపురం జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 4,837
AP Corona Bulletin

ఏపీలో గడచిన 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 481 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 76, కృష్ణా జిల్లాలో 52, గుంటూరు జిల్లాలో 39, విశాఖ జిల్లాలో 38 కేసులు వెలుగు చూశాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,65,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,46,512 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,367కి పెరిగింది.

More Telugu News