కుప్పం ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు: మిథున్ రెడ్డి
- బాబు పాలనలో కుప్పంలో కేవలం ఐదుగురు మాత్రమే బాగుపడ్డారు
- కుప్పంలో కనీసం తాగునీరు కూడా అందించలేదు
- జగన్ సుపరిపాలన చూసి ఓర్చుకోలేకపోతున్నారు
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన అందిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని... కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు.