చాలాకాలం తర్వాత పెద్దాయనను కలిశాం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీపై సోమిరెడ్డి
- ఢిల్లీ వెళ్లిన సోమిరెడ్డి
- మిత్రులతో కలిసి వెంకయ్యనాయుడిని కలిసిన వైనం
- ఆప్యాయంగా పలకరించారన్న సోమిరెడ్డి
- కుటుంబ యోగక్షేమాలు అడిగారంటూ ట్వీట్
చాలాకాలం తర్వాత పెద్దాయనను కలవడం ఆనందం కలిగించిందని తెలిపారు. ఆప్యాయంగా మాట్లాడారని, కుటుంబ యోగక్షేమాలు అడిగారని, కొవిడ్ అనంతరం నెల్లూరు జిల్లాలో పరిస్థితులు, ప్రజల బాగోగులపై ఆరా తీశారని సోమిరెడ్డి వివరించారు. తమ భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా సోమిరెడ్డి పంచుకున్నారు.