Fire Accident: బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం... ఐదుగురి సజీవదహనం

  • శంకరాపురంలో ఘటన
  • దీపావళి కొనుగోళ్ల కోసం భారీగా వచ్చిన ప్రజలు
  • హోల్ సేల్ టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు
  • 10 మందికి పైగా గాయాలు
Five killed in a fire accident at crackers shop in Tamilnadu

తమిళనాడులోని బాణసంచా తయారీ కేంద్రాల్లో ఇటీవల కాలంలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలోని ఓ బాణసంచా హోల్ సేల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఐదుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలు ఆ దుకాణం పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీపావళి నేపథ్యంలో ప్రజలు టపాసులు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

More Telugu News