Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఆరుగురికి ఏవై.4 వేరియంట్

  • బాధితులందరూ వ్యాక్సినేషన్ పూర్తయినవారే
  • వేరియంట్ జన్యుక్రమాన్ని విశ్లేషించేందుకు నమూనాలు ల్యాబ్‌కు
  • చికిత్స అనంతరం కోలుకున్న బాధితులు
6 persons infected to  AY4 Variant of Coronavirus in Madhya Pradesh

ఏవై.4గా పిలుస్తున్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారే కావడం గమనార్హం. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది.

ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ ప్రధానాధికారి బీఎస్ సాయిత్య తెలిపారు.

More Telugu News