సూపర్-12లో నేడు ఆసియా జట్ల సమరం... తొలి మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్
- టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశ పోటీలు
- షార్జాలో శ్రీలంక, బంగ్లాదేశ్ సమరం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- రాత్రి జరిగే మ్యాచ్ లో భారత్, పాక్ ఢీ
ఇరుజట్లలోనూ స్పిన్నర్లు, ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహంలేదు. రెండు జట్లలోనూ ఒక్కో మార్పు జరిగింది. బంగ్లాదేశ్ జట్టులో పేసర్ తస్కిన్ మహ్మద్ స్థానంలో నసూమ్ అహ్మద్ జట్టులోకి రాగా, శ్రీలంక జట్టులో మహీశ్ తీక్షణ స్థానంలో బినుర ఫెర్నాండోకు తుదిజట్టులో స్థానం కల్పించారు.