Pattabhi: టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

High Court granted bail for TDP leader Pattabhi
  • హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ
  • ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న పట్టాభి
  • ఇటీవల 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
ఇటీవల సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Pattabhi
Bail
AP High Court
TDP
Andhra Pradesh

More Telugu News