cp: హోంగార్డు లింగ‌య్య త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్.. వీడియో ఇదిగో

  • సీపీ ఆధ్వ‌ర్యంలో పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం
  • అమ‌ర‌వీరుల‌ కుటుంబాల‌ను స‌త్క‌రించిన‌ మ‌హేశ్ భ‌గ‌వ‌త్
  • 2015లో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు లింగ‌య్య
cp salutes home guard mother

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఓ హోం గార్డు త‌ల్లికి పాదాభివంద‌నం చేసిన దృశ్యాల‌కు సంబంధించ‌ని వీడియోను ఆ క‌మిష‌న‌రేట్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా వారి కుటుంబాల‌ను మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌త్క‌రించారు.

అంబ‌ర్‌పేట్ కార్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో హోంగార్డు లింగ‌య్య త‌ల్లి సార‌మ్మ పాల్గొంది. ఈ నేప‌థ్యంలో ఆమెకు  మ‌హేశ్ భ‌గ‌వ‌త్ పాదాభివంద‌నం చేశారు. కాగా, 2015లో ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ఆత్మ‌కూర్ ప‌రిధిలోని సిమీ ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులతో పాటు  హోంగార్డు లింగ‌య్య అమ‌రుల‌య్యారు. వారంద‌రికీ పోలీసులు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News