శ్రీకాకుళంలో విషాదం.. చెరువులో పడ్డ స్కూలు బస్సు.. ఒక విద్యార్థి మృతి
- ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో ఘటన
- ఎనిమిది మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు
- మిగిలిన విద్యార్థులను రక్షించిన స్థానికులు
ఈ ప్రమాదంలో నీటిలో పడిన మిగిలిన విద్యార్థులను స్థానికులు వెంటనే రక్షించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించి, విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. చెరువులో పడిన స్కూలు బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.