Sirimanu Utsavam: విజయనగరంలో ప్రారంభమైన సిరిమాను ఉత్సవం... సంచయిత దూరం!

Vijayanagaram Sirimanotsavam starts
  • హాజరైన అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు
  • తనకు ఆహ్వానం అందలేదన్న సంచయిత
  • గతేడాది మాన్సాస్ చైర్ పర్సన్ హోదాలో పాల్గొన్న సంచయిత
  • కోర్టు ఆదేశాలతో చైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న వైనం
దసరా పండుగ అనంతరం ప్రతి ఏడాది విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సిరిమాను ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి కోట బురుజుపై ఆసీనులయ్యారు. అయితే సంచయిత గజపతి ఈసారి సిరిమాను ఉత్సవానికి దూరమయ్యారు.

గతేడాది మాన్సాస్ చైర్మన్ హోదాలో ఈ వేడుకల్లో పాల్గొన్న సంచయిత ఈసారి ఉత్సవాల్లో కనిపించలేదు. ఆమె ఇటీవల కోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్సాస్ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా, తనకు ఈ ఏడాది సిరిమాను ఉత్సవం కోసం ఆహ్వానం అందలేదని సంచయిత చెబుతున్నారు. అటు, గతేడాది సిరిమాను ఉత్సవంలో తమకు ఎదురైన అనుభవాల పట్ల అసంతృప్తికి గురైన సుధా గజపతి ఈసారి ఆనందోత్సాహాలతో ఉత్సవంలో పాల్గొన్నారు.

More Telugu News

Sirimanu Utsavam
Vijayanagaram
Ashok Gajapathi Raju
Sanchaita