Sri Lanka: టీ20 వరల్డ్ కప్: నమీబియాపై టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Sri Lanka won the toss against Namibia
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్ లో నేడు రెండో మ్యాచ్ లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడుతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక జట్టు అటు అనుభవజ్ఞులు, యువకుల కలయికతో పటిష్ఠంగా కనిపిస్తోంది. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని నమీబియా ఈ మ్యాచ్ లో శ్రీలంకకు ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మొదట బ్యాటింగ్ కు దిగిన నమీబియా 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.

ఇక, టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో, టీమిండియా నేడు ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ పోరు దుబాయ్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 7 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో పతనమైన రెండు వికెట్లు షమీ ఖాతాలో చేరాయి.
Go Back to Shorts
Sri Lanka
Namibia
Toss
T20 World Cup
India
England
Warmup

More Telugu News