ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణను పరామర్శించిన దేవినేని ఉమ

Devineni Uma visits Manda Krishna
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఇటీవల ఢిల్లీలోని ఓ హోటల్లో కాలుజారి పడడం తెలిసిందే. ఈ ఘటనలో మంద కృష్ణ కుడికాలి ఎముక విరిగింది. ఆయన కాలికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మంద కృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ నేడు మంద కృష్ణ నివాసానికి వెళ్లారు. బెడ్ రెస్టు తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్ అధినేతను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ వెంట మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. గాయం తాలూకు వివరాలను మంద కృష్ణ టీడీపీ నేతలకు వివరించారు. మెడికల్ రిపోర్టులను వారికి చూపించారు.
Go Back to Shorts
Devineni Uma
Manda Krishna Madiga
Injury
Surgery

More Telugu News