Mahesh Babu: బార్సిలోనాలో మహేశ్ .. కీర్తి డ్యూయెట్లు పాడుకుంటున్నారన్న తమన్! 

  • స్పెయిన్ కి వెళ్లిన 'సర్కారువారి పాట'
  • నాయకా నాయికలపై పాటల చిత్రీకరణ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • జనవరి 13వ తేదీన భారీస్థాయి విడుదల
Sarkaru Vaari Paata Shooting update

మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ .. 14 రీల్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. హైదరాబాద్ .. గోవా .. దుబాయ్ లలో ఈ సినిమా ఇంతవరకూ షూటింగు జరుపుకుంది.

పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా ఇటీవల స్పెయిన్ వెళ్లింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ పై పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తమన్ తెలియజేస్తూ, దర్శక నిర్మాతలతో అక్కడ దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. పాటల్లో సూపర్ స్టార్ ఎనర్జీకి సాక్ష్యంగా నిలవడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్పాడు.

బ్యాంకు వ్యవస్ధలోని లోపాలు .. ఆర్ధికపరమైన మోసాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. సీరియస్ పాయింట్ చుట్టూ వినోదభరితగా తిరిగే కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్డేట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Loading...

More Telugu News