వైసీపీ నేతల తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
- ప్రకాశం జిల్లా మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడి
- దళితులను అణచివేయడమే లక్ష్యమా?
- దాడులు చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలి
పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే అందుకు కారణం దళితులా? అని ఆయన నిలదీశారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీలోని ఓ వర్గానికి ఆ మంత్రి భయపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో దళితుల భూములకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన విమర్శించారు.