షూటింగు పార్టు పూర్తిచేసుకున్న 'థ్యాంక్యూ'
- విక్రమ్ కుమార్ నుంచి మరో విభిన్న చిత్రం
- నాగచైతన్య సరసన నాయికగా రాశి ఖన్నా
- ముఖ్య పాత్రల్లో అవిక .. మాళవిక నాయర్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ఆయన తాజా చిత్రంగా ' థ్యాంక్యూ' ఆ మధ్య పట్టాలపైకి వెళ్లింది. కరోనా కారణంగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూనే షూటింగు చేస్తూ వెళ్లారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న పీసీ శ్రీరామ్ వెల్లడించారు.
చైతూ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా రాశి ఖన్నా అందాల సందడి చేయనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అవిక గోర్ .. మాళవిక నాయర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ ఏడాది 'లవ్ స్టోరీ'తో హిట్ కొట్టిన చైతూ, వచ్చే ఏడాది 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.