సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- విజయ్ కి జంటగా మరోసారి కీర్తి సురేశ్
- 'సలార్'లో ఛాన్స్ కొట్టేసిన 'ఖిలాడి' భామ
- చివరి దశకు 'రామారావు ఆన్ డ్యూటీ'
* ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో మరో నాయికగా 'ఖిలాడి' ఫేమ్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధాన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
* రవితేజ కథానాయకుడుగా నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే చివరి షెడ్యూలును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ కొంత షూటింగ్ చేశాక, రెండు పాటలను యూరప్ లో చిత్రీకరిస్తారు.