Amaravati JAC: అమరావతి నుంచి తిరుమల వరకు జేఏసీ మహా పాదయాత్ర

  • తుళ్లూరులో అమరావతి జేఏసీ విస్తృత స్థాయి సమావేశం
  • 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట మహా పాదయాత్ర
  • నవంబరు 1న ప్రారంభం
  • డిసెంబరు 17న ముగియనున్న పాదయాత్ర
Maha Padayatra from Amaravati to Tirumala

ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో నేడు అమరావతి జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని తీర్మానించారు. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట చేపట్టనున్న ఈ మహా పాదయాత్ర నవంబరు 1న ప్రారంభం కానుంది.

ఈ పాదయాత్రలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని జేఏసీ నేతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తీవ్ర నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ మహా పాదయాత్ర డిసెంబరు 17న ముగుస్తుందని అన్నారు.

More Telugu News