KKR: ఐపీఎల్ ఎలిమినేటర్: నరైన్ కు నాలుగు వికెట్లు... బెంగళూరు 138-7

  • షార్జాలో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్
  • బెంగళూరు వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • కోహ్లీ 39, పడిక్కల్ 21
  • విఫలమైన భరత్, మ్యాక్స్ వెల్
KKR Bowlers restricts RCB for low totla

ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కీలక పోరులో బెంగళూరును కట్టడి చేశారు. ముఖ్యంగా సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేసిన 4 వికెట్లు తీశాడు. ఫెర్గుసన్ 2 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు టీమ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ పడిక్కల్ 21 పరుగులు చేశాడు. భరత్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. మ్యాక్స్ వెల్ (15) విఫలమయ్యాడు.

More Telugu News