ఢిల్లీలో అమిత్ షాను కలిసిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసుల వివరాలతో కూడిన లేఖ అందజేత
- ఎంపీ అరవింద్, సోదరుడితో కలిసి ఢిల్లీలో షాను కలిసిన మాతమ్మ
- ఇప్పటి వరకు 35 కేసులు నమోదయ్యాయని ఫిర్యాదు
- ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన
అక్రమంగా కేసులు పెట్టి మల్లన్నను వేధిస్తున్నారని ఆరోపించారు. కేసు మీద కేసు పెడుతూ జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని, ఇప్పటి వరకు 35 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిలు వస్తే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు మల్లన్నపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలతో కూడిన లేఖను అందించారు. కాగా, మల్లన్న బీజేపీలో చేరబోతున్నట్టు ఇటీవల ఆయన చానల్ క్యూ న్యూస్ ప్రకటించింది.