తెలంగాణలో కొత్తగా 207 మందికి కరోనా పాజిటివ్
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 61 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 4,421 మందికి చికిత్స
అదే సమయంలో 239 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,409 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,421 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,923కి పెరిగింది.
